- నగరంలో పెరుగుతున్న కొత్త కాలనిలకు అనుగుణంగా బస్సు రూట్ లు పెంచేలా స్టడీ చేయండి
- కారుణ్య నియామకాల కింద నియమించబడిన కండక్టర్ ల ప్రొవిజన్ పిరియడ్ 3 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలకు తగ్గించేలా పరిశీలించండి
- నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపో లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు .. లాభాల్లోకి వచ్చేలా ఆయా డిపోలకు ప్రత్యేక కార్యాచరణ
- అరంఘార్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ , పోలీస్ శాఖల భూ బదలాయింపు పై చర్చించాలి
- నగరంలో కొత్త బస్సు డిపో లకు స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ తో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి
- బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు
- ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ ఏర్పాటు ,బస్సు సౌకర్యాల పై అధ్యయనం చేయాలి
- త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కండక్టర్ లు ,డ్రైవర్లు ఇతర ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తా -ఆర్టీసీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం లో మంత్రి పొన్నం ప్రభాకర్
మహా లక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ లో ఇప్పటి వరకు మహిళలాలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారు. 7980 కోట్ల రూపాయలు ఆర్టీసీ కి ప్రభుత్వం చెల్లించింది. టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్టీసీ బస్సులు ,బస్ స్టేషన్ లలో & టీమ్ మిషన్ ల ద్వారా వచ్చే టికెట్ పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు.
ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు ,వికారాబాద్ , బీహెచ్ఈఎల్ , మియాపూర్ , కుషాయిగూడ , దిల్ సుఖ్ నగర్ , హకీంపేట్ , రాణిగంజ్ , మిథాని తో పలు పలు డిపో లు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు , స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశి చారు. నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలని లకు ,నగరానికి సంబంధించిన వారు ఉదాహరణగా కొల్లూరు వద్ద డబుల్ బెడ్ రూం ల వద్ద నివసిస్తున్న వేలాది మందికి రవాణా సౌకర్యాలు కల్పించడానికి డిమాండ్ కు అనుగుణంగా కొత్త రూట్ లలో బస్సులు నడిపించేలా స్థానిక డీఎం ఇతర ఆర్టీసీ అధికారులతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఒక నివేదిక ను రూపొందించి బస్సులు నడిపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 578 బస్సులు కొత్తగా రాష్ట్రంలో రోడ్డెక్కాయి. త్వరలో మరిన్ని కొత్త బస్సులు రానుండడంతో వాటిని ప్రయాణికుల ట్రాఫిక్ ఎక్కువగా ప్రాంతాల్లో నడిపించాలని సూచించారు.
ఇప్పటికే ఆర్టీసీ లో 1000 ఆర్టీసీ డ్రైవర్లు ,743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్వ్యూ దశలో ఉండడంతో నియామకాలు వేగంగా పారదర్శకంగా జరిగేలా పూర్తి చేయాలని తెలిపారు. వచ్చే డిసెంబర్ చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ,114 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియామక ప్రక్రియ టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కారుణ్య నియామకాల కింద చేరిన ఆర్టీసీ కండక్టర్లకు ఉన్న మూడు సంవత్సరాల ప్రొవిజన్ రెండు సంవత్సరాలకు తగ్గించేలా పరిశీలించాలని అధికారులకు సూచించారు. మేడారం జాతర సమీపిస్తుండటంతో ములుగు బస్ స్టేషన్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ లోపు స్లాబ్ పనులు పూర్తి చేయాలని జాతర సమీపిస్తుండటంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం , పెద్దపల్లి జిల్లా బస్సు డిపో పనుల పురోగతి పై అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలు వచ్చే లోపు మంథని బస్ స్టేషన్ ఆధునీకరణ పూర్తి కావాలని ఆదేశించారు. మధిర బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. హుజూర్ నగర్ ,కోదాడ బస్ స్టేషన్ ల శంకుస్థాపన వారం రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మిర్యాలగూడ అప్ గ్రేడేషన్ పనులు ప్రారంభించాలని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ నిర్మాణం , బస్ సౌకర్యాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా కొత్త డిపో లకు అవసరమైన స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని తెలిపారు. నగరంలో నలువైపుల బస్ స్టేషన్ లు ఉండేలా జెబిఎస్ మాదిరి ఆరంఘర్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మించడానికి ఆర్టీసీ ,పోలీస్ శాఖ కి సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉప్పల్ కూడా నిర్మించడానికి అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రవాణా శాఖ సీజ్ చేసిన వాహనాలు బస్సు డిపో లో చాలా కాలంగా పేరుకుపోవడంతో వారికి సమయం ఇచ్చి యాక్షన్ వేయాలని సూచించారు. ఆర్టీసీ లో ప్రమాదాలను తగ్గించడానికి తొలి దశలో లహరి , రాజధాని , గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం ను పని తీరును అడిగి తెలుసుకున్నారు . దీని ద్వారా డ్రైవర్ నిద్ర ఉపక్రమించే సూచనలు కానీ ,మొబైల్ వాడుతున్నప్పుడు మానిటరింగ్ చేస్తూ అప్రమత్తం చేస్తుంది. ఇక ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ లకు నిరంతరం శిక్షణ ప్రతి బస్సు కి ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి నిర్ణయాన్ని కఠినతరం చేయాలని పేర్కొన్నారు. డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లకు నిరంతర శిక్షణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఇది విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించారు. తార్నాక హాస్పిటల్ లో రోగుల బంధువుల కోసం ఏర్పాటు చేస్తున్న డార్మిటరీ రూం ను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ ఫంక్షన్ హాల్ లు వస్తున్న ఆదాయం ఖర్చులు వివరాల పై ఆరా తీశారు. దీని ద్వారా మరింత ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఆర్టీసీ మహిళా సంఘాలు ద్వారా 600 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించాలని సెర్ఫ్ తో ఒప్పందం చేసుకుంది . ఇప్పటి వరకు 150 బస్సులు మహిళా సంఘాలు ఆర్టీసీ తో సంయుక్తంగా నడుస్తున్నాయి. మిగిలిన 450 బస్సులు కూడా మహిళా సంఘాల ద్వారా తీసుకోవాలని ఆదేశించారు. గత ఏడాది మేడారం జాతర కోసం 3490 బస్సులు నడపగా 16.83 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ లో ప్రయాణించారు. ఈసారి జాతర కు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ లో ప్రయాణిస్తారని అంచనా వేస్తూ 3800 బస్సులు నడపడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ,ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
