కాళేశ్వరం ఆలయ పాలక మండలి చైర్మన్‌గా రాంనారాయణ గౌడ్‌

శ్రీ కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా గంట రాంనారాయణగౌడ్‌ను ఆలయ ధర్మకర్తలు సోమవారం ఏకగ్రీవంగా ఎనున్నకున్నారు. గత చైర్మన్‌ బొమ్మర వెంకటేశం అనారోగ్యంతో మృతి చెందగా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మరో చైర్మన్‌ను ఎన్నుకున్నారు. ఆలయ అభిషేక మండపం ఆవరణంలో ఈవో మారుతి అధ్వర్యంలో ధర్మకర్తల కమిటీ సమావేశమై రాంనాయణను చైర్మన్‌గా ఎన్నుకోగా అర్చకులు స్వామి వారి శేష వస్త్రలతో సన్మానించి స్వామి వారి ప్రసాదం అందజేశారు.

ఆలయ ధర్మకర్తలకు సన్మానం చేశారు. అనంతరం చైర్మన్‌ రాంనారాయణగౌడ్‌ మాట్లాడుతూ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాననన్నారు. కాగా వచ్చేనెల 23న కమిటీ కాల పరిమితి ముగియనుంది. కార్యక్రమంలో ధర్మకర్తలు ఓగేశ్‌, సంజీవరెడ్డి, శ్రీహరి, సత్యనారాయణ, కృష్ణ్ణారెడ్డి, రాంసింగ్‌, దేదేందర్‌రెడ్డి, రమేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భవాని, ఎంపీటీసీ మమత, సర్పంచ్‌ వెన్నపురెడ్డి వసంత పాల్గొన్నారు.