తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బారినపడివారి సంఖ్య 1,91,386కు చేరింది. గత 24 గంటల్లో మరో 2243 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,60,933కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 29,326 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 23,880 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కరనాతో నిన్న మరో 11 మంది బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1127 మంది ఈ మహమ్మారి వల్ల చనిపోయారు.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎసీ పరిధిలోనే 298 కేసులు ఉన్నాయి. తర్వాత మేడ్చల్ మల్కాజిగిరిలో 176, రంగారెడ్డిలో 172, నల్లగొండలో 141, కరీంనగర్లో 103, భద్రాద్రి కొత్తగూడెంలో 102, ఖమ్మంలో 93, సిద్దిపేటలో 92, వరంగల్ అర్బన్లో 85, సంగారెడ్డిలో 63, నిజామాబాద్లో 57, కామారెడ్డిలో 53, సూర్యాపేటలో 51, జగిత్యాలలో 46, మహబూబ్నగర్లో 45, మహబూబాబాద్లో 45, వనపర్తిలో 41, రాజన్న సిరిసిల్లలో 40, వరంగల్ రూరల్లో 35, నాగర్కర్నూల్లో 32, యాదాద్రి భువనగిరిలో 31, ములుగులో 31, పెద్దపల్లిలో 31, మెదక్లో 30, జనగామలో 29, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్లో 26, మంచిర్యాలలో 27, జయశంకర్ భూపాలపల్లిలో 25, ఆదిలాబాద్లో 24, నిర్మల్లో 24, వికారాబాద్లో 24, జోగులాంబ గద్వాలలో 23, నారాయణపేటలో 8 కేసుల చొప్పున నమోదయ్యాయి.