తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 293 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,95,609 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1145కు చేరింది.
