తెలంగాణలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్

ఈనెల 25 వ తేదీ నుంచి ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణలోని ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. రాష్ట్రంలోని 590 రెవెన్యూ, మండ‌ల‌ కార్యాలయాల్లో ప్రస్తుతం అందుబాటులో 12 ఎంబీపీఎస్ వేగంతో బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ఉంది. దీనికి అదనంగా మరో కనెక్షన్ తీసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. స్పీడ్ ఎక్కువగా ఉండే లోకల్ నెట్ వర్క్ కనెక్షన్ తీసుకునే వేసులుబాటును తహసీల్దార్లకు కల్పిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.