హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ స్టేడియంలో మంగళవారం యాజమాన్యం చేపట్టిన ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి వచ్చిన ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని మొక్క నాటి మాట్లాడారు. పర్యావరణ సమతుల్యత, కా లుష్య నివారణ, కోతు ల ఆహార సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ హరితహారం ప్రారంభించారని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరిట ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని సంకల్పించి, అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎన్టీపీసీ సీజీఎం సునీల్కుమార్ మొక్కలు నాటారు. ఇక్కడ జీఎం పీకే లాడ్, రామగుండం మేయర్ బంగి అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కాళేశ్వరం దేవస్థానం కమిటీ డైరెక్టర్ ఆరెల్లి సత్యనారాయణ గౌడ్, సీఎస్ఆర్ అధికారి వేముగంటి యుగేంధర్రావు తదితరులు ఉన్నారు.