తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1330కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
