ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత పదిరోజులుగా 3వేల లోపే పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 1,916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 3,033 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ తీవ్రత కారణంగా 13 మంది మృతి చెందారు.
ఏపీలో ఇప్పటివరకు 8,27,882 మంది కొవిడ్-19 వైరస్ బారినపడగా 7,98,625 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్ల కారణంగా 6,719 మంది మృత్యువాతపడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 64,581 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 81,82,266 మందికి పరీక్షలు పూర్తిచేశామని అధికారులు వెల్లడించారు.