ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,465 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,477 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కాగా 2,701 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్-19తో 10 మంది మృత్యువాతపడ్డారు. జిల్లాల వారీగా తాజా కొవిడ్-19 మరణాల వివరాలిలా ఉన్నాయి. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, అనంతపూర్, చిత్తూర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో ఒక్కరి చొప్పున మరణించారు.
