ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 2,477 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా 2,477 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 75,465 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా వీటిలో 2,477 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. కాగా 2,701 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌-19తో 10 మంది మృత్యువాత‌ప‌డ్డారు. జిల్లాల వారీగా తాజా కొవిడ్-19 మ‌ర‌ణాల వివ‌రాలిలా ఉన్నాయి. గుంటూరు, కృష్ణా, విశాఖ‌ప‌ట్నంలో ఇద్ద‌రు చొప్పున‌, అనంత‌పూర్‌, చిత్తూర్‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఒక్క‌రి చొప్పున మ‌ర‌ణించారు.