ఏపీ లాసెట్ -2020 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కన్వీనర్ జ్యోతి విజయకుమార్, రెక్టార్ కృష్ణానాయక్ ఫలితాలను విడుదల చేశారు. 18371 మంది పరీక్ష రాయగా.. 11226 మంది అభ్యర్థులు లాసెట్ లో ఉత్తీర్ణత సాధించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 1న ఏపీ లాసెట్ నిర్వహించారు. మొదటిసారి విడుదల చేసిన ‘కీ’లో తప్పులు ఉండటంతో మరోసారి ప్రాథమిక ‘కీ’ విడుదల చేశారు.
