ప్రముఖ కవి దేవీప్రియ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టునిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారని సీఎం కొనియాడారు. ఆయన సాహిత్య ప్రతిభకు ‘గాలి రంగు’ రచన మచ్చుతునక అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ కవి దేవీప్రియ గత కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఈనెల 6న నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 7.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. సాహితీ లోకంలో దేవీప్రియగా గుర్తింపు పొందిన ఆయన అసలుపేరు షేక్ ఖాజా హుస్సేన్.
