కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అహ్మద్ పటేల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గత నెల 1న ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన గురుగ్రామ్లోని మేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంలో ఈనెల 15 నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆయన అవయవాలు చికిత్సకు సహకరించక పోవడంతో ఇవాళ ఉదయం 3.30 గంటలకు మరణించారు.