ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి: సైబరాబాద్ సీపీ సజ్జనార్‌

ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. సైబారబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎన్నికల నిర్వహనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సైబరాబాద్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. పోలింగ్‌ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పకడ్బందీ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి సూచించారు.