భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైందని రా జ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ నారాయణ, సిబ్బందితో కలి సి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన రాజ్యాంగం ఆమోదించిన రోజు నవంబర్ 26 అని గుర్తు చేశారు. కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడ మే భారత రాజ్యాంగం లక్ష్యమన్నారు. భారత రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకుని, రాజ్యాంగం ఇవ్వడం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన అందరిని స్మరించుకోవాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ వెంకటగిరి, ఆర్ఐలు, డీపీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
