చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి టీ తాగుతున్న ఉద్యోగులను స్టేషన్కు రమ్మని పిలిచి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. ఇటీవల చౌటుప్పల్ ప్రాంతంలోని దివీస్ ఫార్మా కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి తోటి మహిళా ఉద్యోగితో కలిసి అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో టీ తాగుతున్నారు. అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న చౌటుప్పల్ పోలీసుస్టేషన్కు చెందిన చంద్రశేఖర్, లింగస్వామి వారిని అటకాయించి పోలీస్ స్టేషన్కు రావాలని బెదిరించారు.
తాము విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నామని చెప్పినా వినకుండా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని దివీస్ ఫార్మా ఉద్యోగులు యాదాద్రి-భువనగిరి డీసీపీ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై డీసీపీ ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణలో వెలుగుచూసిన ఆధారాలతో సీపీ మహేశ్ భగవత్ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు.