నల్లగొండ జిల్లాలోని హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. త్వరలోనే డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
