గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ సినిమా నిర్మాత దిల్ రాజు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ లోని తన నివాసంలో తన మనువడితో కలిసి 3 మొక్కలు నాటడం జరిగింది.
ఈసందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నా మిత్రులు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని దీని వలన మన రాష్ట్రం, మన దేశం ఆకుపచ్చగా మారబోతున్నది అని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కి అభినందనలు తెలిపారు. అదే విధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మరొక ముగ్గురికి ఈ చాలెంజ్ ఇస్తున్నానని వారు కూడా స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు 1) ప్రముఖ హీరో మహేష్ బాబు, 2) డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, 3) అనిల్ రావిపూడి లను మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.