కరోనాతో లింగోజిగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్‌ మృతి

బీజేపీ తాజా కార్పొరేటర్‌, ఎల్‌బీనగర్‌ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆకుల రమేశ్‌గౌడ్‌ కరోనాతో  సాయంత్రం కన్నుమూశారు. గతనెలలో జరిగిన ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్‌ నుంచి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం కరోనా సోకగా కొత్తపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అప్పటికీ నయం కాకపోవడంతో గచ్చిబౌలిలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులు, గుండె సంబంధ సమస్య తీవ్రం కావడంతో తుదిశ్వాస విడిచారు.