ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని లేబర్ కమిషన్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రబ్బానీ రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. లేబర్ కమిషన్ కార్యాలయంలో పని నిమిత్తం వచ్చిన ఓ వ్యక్తి నుంచి కొంత మొత్తాన్ని డిమాండ్ చేశాడు. దీంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు బాధితుడు ఇస్తున్న డబ్బును జూనియర్ అసిస్టెంట్ రబ్బానీ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
