రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అధి శ్రావణ యాగం నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని.. ఆశీర్వచనం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న యాగానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనన్నారు. యాగానికి పదివేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. యాగానికి హాజరయ్యే భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అందజేయనున్నట్లు వివరించారు.
