గజ్వేల్ మండలం సంగాపూర్లో కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ను మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. 117 హెక్టార్లలో రూ.7.43 కోట్ల వ్యయంతో గజ్వేల్, వర్గల్ ప్రధాన రహదారిని అనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కును తీర్చిదిద్దారు. పార్క్ లోపల ‘సేవ్ ఫారెస్ట్.. సేవ్ ఎర్త్’ పేరిట ఏర్పాటు చేసిన భారీ గ్లోబ్, వాచ్ టవర్, ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ఆటస్థలం, గజీబొ, రాశివనం, ఓపెన్ డైనింగ్, ఇతర సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా రాధశర్మ, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, సీఎఫ్ శర్వనంద్, డీఎఫ్ఓ శ్రీధర్రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
