సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటి కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ జీ రవి అధికారులను ఆదేశించారు. బుధవారం కోటి వృక్షార్చన కార్యక్రమంపై అధికారులతో జూమ్ యాప్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయతీలో వెయ్యి మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని నివేదికను అందజేయాలని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బేతి రాజేశం, జల్ద అరుణశ్రీ, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్డీఏ లక్ష్మీనారాయణ, ఎంపీవోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
