
ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన నరేందర్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ఎంపీ సంతోష్ కుమార్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురిని ఆయన గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. 1) తణుకు ఎమ్మెల్యే కనుమూరి వెంకటేశ్వరరావు, 2) మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, 3) ఎంపీ రఘురామ రాజు ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా కోరారు.