ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ను పార్టీ హైకమాండ్ నియమించింది.ఎన్ తులసీరెడ్డి, షేక్ మస్తాన్ వలీని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ఈ నియామకం వెంటనే అమలులోకి వస్తుందని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రఘువీరా రెడ్డి ఏపీసీసీ చీఫ్ గా ఉన్నారు.