సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకట్రామిరెడ్డికి జైలు శిక్ష

తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఇద్దరు కలెక్టర్లు, ఆర్డీవోకు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలు శిక్ష విధించింది. ఈ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో కోర్టు ఆదేశాలు పాటించలేదని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సిద్ధిపేట కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డికి 3 నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అలానే పిటిషనర్‌కు 25వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.