సమాచార కమిషనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఖాళీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్‌ ఏఆర్‌)కె.ప్రవీణ్‌ కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటలలోగా వ్యక్తిగతంగా గానీ.. రిజిస్టర్‌ పోస్టులో గానీ పంపించాలని సూచించారు.