ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు కేటీఆర్‌

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లారు. టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ అధ్యక్షులు గందె శ్రీధర్‌ మంత్రికి స్వాగతం పలికారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు డబ్ల్యూఈఎఫ్‌-50వ వార్షిక సదస్సు జరగనుంది. వివిధ దేశాల నుంచి ఆర్థిక వేత్తలు, రాజకీయవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. సంస్థ ప్రత్యేక ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్‌ దావోస్‌కు వెళ్లారు. ఈ సదస్సులో నాలుగో పారిశ్రామిక విప్లవంలో ‘టెక్నాలజీ ప్రయోజనాలు-ఎదురయ్యే సవాళ్ల’పై చర్చ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రగతిని వివరించేలా ప్రసంగించనున్నారు. సదస్సు అనంతరం ప్రముఖ కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. వారికి రాష్ట్రంలోని అవకాశాలు వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.