ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎంపీడీవో ఆల్బర్ట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఆడేపు రామలింగయ్య అనే కాంట్రాక్టర్ స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ పనులు చేస్తున్నాడు.
కాగా, చెక్పై సంతకం పెట్టేందుకు ఎంపీడీవో ఆల్బర్ట్ రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రూ.20వేలు ఎంపీడీవో ఆల్బర్ట్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్కు చెందిన ఏసీబీ అధికారి మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.