తెలంగాణలో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ

క‌రోనా కేసుల తీవ్ర‌త దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వ నైట్ క‌ర్ఫ్యూను విధించిన విష‌యం విదిత‌మే. ఈ క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల‌తో పాటు మీడియా, పెట్రోల్ బంక్‌ల‌కు మిన‌హాయింపు ఇచ్చారు. నీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్యం ప‌నుల‌కు రాత్రి క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు.

మిన‌హాయింపు

అత్య‌వ‌స‌ర సేవ‌లు, పెట్రోల్ బంకులు, మెడిక‌ల్ షాపులు, డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్లు, ఆస్ప‌త్రులు, ప్ర‌యివేటు సెక్యూరిటీ స‌ర్వీసులు, ఈ-కామ‌ర్స్ సేవ‌లు, ఆహార ప‌దార్థాల పంపిణీ, కోల్డ్ స్టోరేజ్‌లు, గోడౌన్ల‌కు మిన‌హాయింపు ఇచ్చారు. విమాన, రైలు, బ‌స్సు ప్ర‌యాణికుల‌కు వ్యాలిడ్ టికెట్లు ఉంటే క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌నున్నారు. వైద్యం కోసం వెళ్లే గ‌ర్భిణులు, రోగుల‌కు కూడా మిన‌హాయింపు ఇచ్చారు. అంత‌రాష్ర్ట ర‌వాణాకు ఎలాంటి పాసులు అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

నిషేధం

పౌరులు బ‌య‌ట తిర‌గ‌డం, థియేట‌ర్లు, ప‌బ్బులు, క్ల‌బ్బులు, బార్లు, రెస్టారెంట్లు, మ‌ద్యం దుకాణాలు, హోట‌ల్స్ రాత్రి 8 గంట‌ల త‌ర్వాత బంద్ కానున్నాయి.