
ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు రివైజ్డ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు జగగాల్సి ఉండగా పలువురు అభ్యర్థుల నుంచి పరీక్షలు వాయిదా వేయాలని విన్నపాలు అందడంతో కమిషన్ ఇటీవల పరీక్షల్ని వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తేదీల వారీగా, పేపర్ల వారీగా ఆయా పరీక్షల రివజ్డ్ షెడ్యూల్ ఇలా…ఏప్రిల్ 7 : తెలుగుపేపర్ (క్వాలిఫయింగ్ నేచర్)ఏప్రిల్ 8 : ఇంగ్లిష్ పేపర్ (క్వాలిఫయింగ్ నేచర్)ఏప్రిల్ 11 : పేపర్-1 ఏప్రిల్ 13 : పేపర్-2 ఏప్రిల్ 15 : పేపర్-3 ఏప్రిల్ 17 : పేపర్-4 ఏప్రిల్ 19 : పేపర్-5 వీటితో పాటు గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 10, 11 : అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్మే 11 : మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్మే 12 : సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ ,ఇంజనీరింగ్ పీటీవో, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ గ్రౌండ్ వాటర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్