ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రామోజీఫిలిం సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్ బితోపాటు అక్కినేని నాగార్జున, నిర్మాత అశ్వినీదత్, ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.