చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో జ‌మ్మి మొక్క నాటిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. జ‌మ్మి మొక్క నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో చిన‌జీయర్ స్వామి, జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు, ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం చిన‌జీయ‌ర్ ఆశ్ర‌మానికి సీఎం కేసీఆర్ కుటుంబ స‌మేతంగా వెళ్లిన విష‌యం తెలిసిందే. ముచ్చింత‌ల్ ఆశ్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వేద‌పండితులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను శాలువాల‌తో చిన‌జీయ‌ర్ స్వామి స‌త్క‌రించి, వారిని ఆశీర్వ‌దించారు. ఈ సంద‌ర్భంగా జీవ ప్రాంగ‌ణంలోని కుటీరంలో చిన‌జీయ‌ర్ స్వామితో స‌మావేశ‌మైన సీఎం కేసీఆర్.. భ‌గ‌వ‌త్ రామానుజ‌చార్య ప్రాజెక్టు వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.