తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను కేంద్రం పెంచింది. రాష్ట్రానికి అదనంగా 12 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించినట్టు తెలిసింది. నాన్క్యాడర్ పోలీస్ అధికారులకు దాదాపు 12 మందికి పదోన్నతులు కల్పించి ఐపీఎస్ క్యాడర్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మేరకు వారం కింద కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నిర్వహించిన డీపీసీ ఆమోదించినట్టు అదికారవర్గాలు తెలిపాయి. త్వరలో కేంద్ర హోంశాఖ దీనిపై ఆదేశాలు ఇవ్వనున్నది.
