తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డికి కరోనా వైరస్‌ సోకింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల తనతోపాటు సన్నిహితంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.