గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సినీనటి సాత్విక

ఎంపీ సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు. నగరంలోని ప్రసాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్క నాటారు. అనంతరం సాత్విక మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. భవిష్యత్‌ తరాలను కాలుష్యం నుంచి కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని కోరారు.