
నెవెడా ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొంటున్న కేటీఆర్
దావోస్ వేదికగా తెలంగాణ ఖ్యాతిని 117 దేశాల ముందు ఆవిష్కరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి ఆహ్వానం అందింది. అమెరికాలోని నెవెడాలో ఈ ఏడాది మే 17 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొనాలని కోరుతూ మంగళవారం ఈడబ్ల్యూఆర్ఐ (వరల్డ్ ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్స్ కాంగ్రెస్) ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్ సమ్మతిస్తూ హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1,200 మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. పర్యావరణం, జలవనరుల నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. తాజా అధ్యయన నివేదికలు, పలు కేస్ స్టడీలను విశ్లేషించనున్నారు.