ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా

గద్వాల జిల్లాలోని ఉండవెల్లి తహశీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. భూ మార్పిడి విషయంలో ఆయన రూ.10 వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.