నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రదేశమంతా పొగతో భారీగా కమ్ముకుంది.
ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్ధం రావడంతో భయంతో జనాలు పరుగులు తీశారు. ఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు