గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన తెలంగాణ జాగృతి సభ్యులు శేఖర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి మాచారెడ్డి మండల అధ్యక్షుడు కామాటి శేఖర్ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా శేఖర్ పిలుపునిచ్చారు. ఒక మనిషి మొక్క నాటితే తన జీవిత కాలానికి సరిపడా ఆక్సిజన్ ను అది అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ మల్లేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.