కార్పొరేషన్‌ చైర్మన్ల పదవులకు నేతల రాజీనామా.. సీఎస్‌కు లేఖలు..!

రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని ప్రకటించారు.

రాజీనామా చేసింది వీళ్లే..

  • బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
  • సోమా భరత్‌కుమార్‌, రాష్ట్ర డెయిలీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
  • జూలూరి గౌరీ శంకర్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌
  • దూదిమెట్ల బాలరాజు, గొర్రెలు, మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్‌
  • రవీందర్‌సింగ్‌, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
  • కే వాసుదేవరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌,
  • మన్నె క్రిశాంక్‌, టీఎస్‌ఎండీసీ చైర్మన్‌
  • గెల్లు శ్రీనివాస్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్
  • పల్లె రవికుమార్, గీతవృత్తిదారుల సహకార సంస్థ చైర్మన్
  • పాటిమీద జగన్‌మోహన్‌రావు, టెక్నాలజీ సర్వీసెస్‌ చైర్మన్‌
  • అనిల్‌ కూర్మాచలం, ఫిలిం డెవల్‌పెమంట్‌కార్పొరేషన్‌ చైర్మన్‌
  • గజ్జెల నగేశ్, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
  • మేడే రాజీవ్‌సాగర్, టీఎస్‌ఫుడ్స్‌ చైర్మన్‌
  • ఆంజనేయగౌడ్‌, శాక్స్‌ చైర్మన్‌
  • వై సతీశ్‌రెడ్డి, రెడ్‌కో చైర్మన్‌
  • రామచంద్రనాయక్, ట్రైకార్‌ చైర్మన్‌
  • గూడూరు ప్రవీణ్, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
  • వాల్యానాయక్‌, జీసీసీ చైర్మన్‌