ఇద్దరు తెలంగాణ అధికారులకు ఐఏఎస్‌ హోదా

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్‌ సర్వీస్‌ అధికారులు ఐఏఎస్‌ హోదా పొందారు. నాన్‌ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కె.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్‌రెడ్డిలను ఐఏఎస్‌లుగా నియమిస్తూ సోమవారం కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.