పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్

  • అక్రమ మైనింగ్ కేసులో మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేపడుతున్నారనే ఫిర్యాదుతో వారు కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పరిధిలోని లకుడారం మైనింగ్ కు భూమిని మధుసూదన్ రెడ్డి లీజుకు తీసుకున్నాడు. అయితే, పరిమితికి మించి తవ్వకాలు జరిపారని మధసుదన్ రెడ్డిపై అధికారులు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతుల గడువు ముగిసినప్పటికీ మైనింగ్ కొనసాగించారని గుర్తించి అధికారులు మధుసుదన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మధుసూదన్ రెడ్డి అరెస్ట్ తో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.