ఏపీ డీజీపీగా హరీశ్‌ గుప్తా నియామకం

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా హరీశ్‌ గుప్తా నియామకమయ్యారు. డీజీపీగా హరీశ్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా తక్షణమే విధుల్లో చేరాలని ఆయనను ఆదేశించింది. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఏపీ డీజీపీగా పని చేసిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఆదివారం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈసీ సూచన మేరకు కొత్త డీజీపీని నియమించేందుకు ముగ్గురి పేర్లతో కూడిన ప్యానెల్‌ను ఏపీ సర్కారు పంపింది. సీనియారిటీ జాబితాలో ఉన్న ఐపీఎస్‌ అధికారులు ద్వారకా ఆర్టీసీ ఎండీ తిరుమలరావుతో పాటు మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌కుమార్‌ గుప్తా పేర్లను సిఫారసు చేసింది. ఈందులో హరీశ్‌ గుప్తాను డీజీపీగా ఈసీ ఎంపిక చేసింది.