తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుదిరూపుపై సీఎం రేవంత్ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిహ్నం తుదిరూపుపై క‌ళాకారుడు రుద్ర రాజేశంతో చ‌ర్చించారు. జూన్ 2వ తేదీన అధికారిక చిహ్నంను రేవంత్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ స‌మీక్ష స‌మావేశంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం, అద్దంకి ద‌యాక‌ర్, జేఏసీ నేత ర‌ఘు, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.