
మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డిని, అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను సీఎం అభినందించారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి దిగ్విజయంగా నిర్వహించారు. అన్నిశాఖల సమన్వయం వల్లే జాతర దిగ్విజయంగా జరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారని మెచ్చుకున్నారు. ప్రభుత్వ సిబ్బందికి సహకరించిన ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.