సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిషరణ సభా ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుం డా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలు, ముఖ్యంగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్య లు తీసుకోవాలని సూచించారు. ట్రాఫి క్ ఇబ్బందులు తలెత్తకుండా సచివాలయ భద్రతా సిబ్బంది, ఇతర పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. విగ్రహ ఆవిషరణ కా ర్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించినట్టు మంత్రి తెలిపారు.