మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై కేసు నమోదు

మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నటుడు మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బిఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం నిరూపితం అయితే ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జల్‌పల్లి లో మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన ను పోలీస్ శాఖ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు తాజాగా, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలం టూ రాచకొండ పోలీస్ కమిష నర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు.