ఇంటర్ ఫలితాలు విడుదల

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడదల చేశారు. ఇంటర్‌ సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత,  ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత విద్యార్థులు సాధించారు. గతం కన్నా ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ సారి ఇంటర్ ఫలితాలలో బాలికలదే హవా కొనసాగింది. 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.   గత నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఇంటర్ ఫలితాలు చూడలంటే కింద లింక్‌ను ఓపెన్ చేస్తే కనిపిస్తాయి.