తెలంగాణలో 44 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలం నుంచి వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్లు ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ విభాగానికి సంబంధించి కేవలం ఐదుగురికి మాత్రం పోస్టింగ్లు లభించాయి.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆసి్ఫనగర్ ఏసీపీగా బి. కిషన్ కుమార్, మీర్చౌక్ ఏసీపీగా జి.శ్యామ్ సుందర్, కల్వకుర్తి ఎస్డీపీఓగా సాయిరెడ్డి వెంకటరెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీగా విజయ్కుమార్, మహదేవ్పూర్ ఎస్డీపీఓగా సూర్యనారాయణలను నియమించారు. మిగతా వారికి ఇంటెలిజెన్స్, ఎస్బీ, ట్రాఫిక్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సీఐడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పోస్టింగులు ఇచ్చారు.
