దేవాదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల వార్షిక బడ్జెట్కు ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆలయాలకు బడ్జెట్ కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాల కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ మెమో జారీ చేశారు. ఇప్పటి వరకు దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల వార్షిక బడ్జెట్కు.. ఆలయ అధికారుల నుంచి వచ్చే ప్రతిపాదనలకు ఆ శాఖ అధికారులు ఆమోదం తెలిపేవారు. అయితే బడ్జెట్ కేటాయింపులు, మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. దీంతో ఇకపై ఆ తరహా సమస్యలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
